Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ ప్రముఖ నటుడు నెడుముడి వేణు ఇకలేరు..

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:53 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు సోమవారం మరణించారు. ఆయనకు 73 ఏళ్లు. 
 
గత కొన్ని రోజులుగా తిరువనంతపురంలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్‌ సంబంధిత వ్యాధి చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
నెడుముడి వేణు కెరీర్‌ విషయానికొస్తే ఈయన తన నటనా ప్రస్థానాన్ని చిన్న థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. ఇక 1978లో జీ అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో వేణు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన తన అద్భుత నటనతో మూడు జాతీయ అవార్డుతో పాటు ఏడు రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. నెడుముడి మరణంపై పలువురు సినీ నటునటులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments