Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ ప్రముఖ నటుడు నెడుముడి వేణు ఇకలేరు..

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:53 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు సోమవారం మరణించారు. ఆయనకు 73 ఏళ్లు. 
 
గత కొన్ని రోజులుగా తిరువనంతపురంలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్‌ సంబంధిత వ్యాధి చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
నెడుముడి వేణు కెరీర్‌ విషయానికొస్తే ఈయన తన నటనా ప్రస్థానాన్ని చిన్న థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. ఇక 1978లో జీ అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో వేణు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన తన అద్భుత నటనతో మూడు జాతీయ అవార్డుతో పాటు ఏడు రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. నెడుముడి మరణంపై పలువురు సినీ నటునటులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments