Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిపై టాలీవుడ్ మన్మథుడి క్రేజీ ట్వీట్

Webdunia
మంగళవారం, 21 మే 2019 (17:56 IST)
టాలీవుడ్ గ్రీకువీరుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జునకు మన్మథుడిగా మరో పేరు తెచ్చిన సినిమా మన్మథుడు. నాగార్జున కెరీర్‌లో మరుపురాని సినిమాలలో ఇది కూడా ఒకటి. ఇటీవల ఆ సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు 2ని తెరకెక్కిస్తున్నారు.


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో భారీ స్థాయిలో జరిగింది. ఇక పోర్చుగల్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించుకొని సినిమా యూనిట్ తిరిగి వచ్చిన ఈ సందర్భంగా నాగార్జున చేసిన ట్వీట్ ఆసక్తకరంగా మారింది.
 
ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని, కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా రకుల్ కనిపిస్తారు. ఇక సమంత, కీర్తీ సురేష్ అతిథిపాత్రలు చేసినప్పటికీ.. సినిమాకు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. సమంతపై పోర్చుగల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.

సమంత అక్కినేని గురించి నాగార్జున ట్వీట్ చేస్తూ.. మన్మథుడు 2 సినిమాలో కోడలు పిల్లతో షూటింగ్ చేయడం చాలా సరదాగా సాగిపోయింది. ఇంకా మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తానంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

మన్మథుడు సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 70 శాతం పూర్తయింది. ఇప్పటిదాకా వచ్చిన అవుట్‌పుట్‌పై సినిమా బృందం సంతోషంగా ఉందట. ఈ సినిమా పనులను శరవేగంగా పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలనేది యూనిట్ ప్లాన్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments