Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది బూతు? ఏది కామెడీ? అనేది వాళ్లే నిర్ధారించాలి: నాగబాబు

జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది అనాథలపై చేసిన వివాదాస్పదమైన నేపథ్యంలో ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో నాగబాబు మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై జబర్దస్త్

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (14:32 IST)
జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది అనాథలపై చేసిన వివాదాస్పదమైన నేపథ్యంలో ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో నాగబాబు మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆదితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించింది. అయితే ఆది దొరక్కపోవడంతో.. జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబుతో మాట్లాడేందుకు యాంకర్ ప్రయత్నించారు. కానీ నాగబాబు లైవ్‌లో మాట్లాడేందుకు నిరాకరించారు. 
 
మీడియా, మేధా సంఘాలు, మహిళా సంఘాలన్నీ ఏం ఉద్ధరిస్తాయంటూ ప్రశ్నించారు. వీరికి స్పందించాల్సిన అవసరం లేదని.. ఏది బూతు? ఏది కామెడీ? అనే విషయాన్ని నిర్ధారించాల్సింది ప్రేక్షకులు మాత్రమేనని నాగబాబు తెలిపారు. కానీ ఇదంతా లైవ్‌లో జరగలేదని.. ఫోన్ ఇన్ తీసుకునేందుకు మీడియా ప్రయత్నించినప్పుడు జరిగిన విషయమని సదరు టీవీ యాంకర్ లైవ్ షోలో వివరించి చెప్పారు.
 
హైపర్ ఆది స్కిట్‌లో భాగంగా ఇంతకీ అనాథలు అంటే అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అనాథలు అంటే సంఘంలో ఓ గౌరవం ఉందని మమ్మల్ని కించపరచడమే కాకుండా మా గౌరవానికి భంగం కలిగేలా స్కిట్ చేసిన జబర్దస్త్ కామెడీ షోపైన హైపర్ ఆదిపైన చర్యలు తీసుకోవాలంటే అనాథ యువతులు సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments