Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంది అవార్డులను ''ఎల్లో''గా మార్చేశారు.. చిరంజీవి పేరు..?

దేశ వ్యాప్తంగా పద్మావతి సినిమాపై రచ్చ జరుగుతుంటే.. ఏపీలో నంది అవార్డులపై వివాదాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై నటుడు జీవీ సుధాకర్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (13:28 IST)
దేశ వ్యాప్తంగా పద్మావతి సినిమాపై రచ్చ జరుగుతుంటే.. ఏపీలో నంది అవార్డులపై వివాదాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై నటుడు జీవీ సుధాకర్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. సినీ పరిశ్రమను, నంది అవార్డులను ఏపీ సర్కారు ఎల్లోగా మార్చేసిందని విమర్శలు గుప్పించాడు.
 
ఈ మేరకు ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు తాను దాసరి నారాయణ రావు ప్రోద్భలంతో అరంగేట్రం చేశానని తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని గురించి తెలుసుకున్న దాసరి.. తన పేరు మొదట్లో చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలనూ చేర్చారని, ఈ క్రమంలోనే తన పేరు ముందు జీవి చేరిందని సుధాకర్ నాయుడు చెప్పుకొచ్చారు. విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి కావడంవల్లే ఆ విషయాన్ని తొక్కేశారన్నారు. 
 
మరోవైపు నంది అవార్డులకు లింకు పెట్టి ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైకాపా అధికార ప్రతినిధి కె. పార్థసారథి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు. పోలవరంకు కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని పార్థసారథి సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments