Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె విషయంలో అంతా క్లియర్ : నాగబాబు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో దాడి చేశారు. ఈ దాడుల్లో మెగా డాటర్ నిహారికతో పాటు అనేక మంది సినీ రాజకీయ నేతల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిహారికను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన కుమార్తె విషయంలో అంతా క్లియర్ అంటూ వెల్లడించారు. అందువల్ల తన కుమార్తె గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పబ్‌లో తన కుమార్తె నిహారిక ఉండటం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 
 
అయితే, తన కుమార్తె విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఇక ఈ విషయంపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశ్యంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments