Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ సినిమా వివాదం... దేవాలయం పక్కన బార్‌లు..

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (22:07 IST)
అక్కినేని నాగ చైతన్య సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చైతన్య- కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతోంది. 
 
అక్కడ భారీ బార్ సెటప్ వేసి కొన్ని కీలకమైన సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే షూటింగ్ జరుపుతుండగా పక్కనే ఉన్న గ్రామస్థులు చిత్ర బృందంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు షూటింగ్ చేస్తున్న పక్కనే ప్రసిద్ధ రాయగోపుర దేవాలయం ఉంది.
 
నిత్యం పూజలు జరుగుతూ పవిత్ర స్థలంగా ప్రజలు కొలిచే దేవాలయం పక్కన మందు సెటప్, బార్ సెట్‌లు, నృత్యాలు ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా ఇది హిందువులను అవమానించడమే అని చిత్ర బృందం వేసిన సెట్‌ను కూల్చివేశారట. 
 
ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి మాండ్య డిసి అశ్వతి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఆ అనుమతి కేవలం రెండు రోజులకు మాత్రమే అని, అందులోనూ ఇలాంటి సీన్స్ ఉంటాయని ఆయనకు చెప్పలేదని సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments