Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా, పారితోషికం తెలిస్తే షాకే

Webdunia
బుధవారం, 20 మే 2020 (19:06 IST)
కేజీఎఫ్ సినిమా హిట్‌తో హీరో యష్‌కు ఎంత మంచి క్రేజ్ వచ్చిందో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న నీల్ ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో బహుభాషా చిత్రం తీయడానికి సన్నద్ధమవుతున్నారు. 
 
మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ సినిమా పూర్తి మాస్ థ్రిలర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
 
ఇక నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ తన విషెస్‌తో పాటుగా ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. నా నెక్స్ట్ సినిమా న్యూక్లియర్ ప్లాంట్ లాంటి హీరోతో. నా రేడియేషన్ సూట్ తెచ్చుకోవాల్సిందే. హ్యాపీ బర్త్ డే బ్రదర్. హావ్ ఎ సేఫ్ అండ్ గ్రేట్ బర్త్‌డే. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమా కోసం మైత్రీ మూవీస్ వారు నీల్‌కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసారంట. ఇప్పటికే అడ్వాన్స్‌గా 2 కోట్లు ఇచ్చారని, పూర్తి పారితోషికం సుమారు 5 కోట్ల పైమాటేనని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

తర్వాతి కథనం
Show comments