Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నా

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (09:20 IST)
రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్‌ (నీచులు). ఒక్కొక్కరికి 25 వేల ఎకరాలున్నాయి. రూ.25 వేల కోట్లు సంపాదించారు. ఆ డబ్బంతా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అని నటుడు మోహన్‌బాబు ఉద్వేగంగా ప్రశ్నించారు. 
 
తన స్నేహితుడు, సోదరుడు ఎన్టీఆర్‌కు అవినీతి అంటేనే తెలియదని, ఆయనే తనను రాజ్యసభకు పంపగా ఎలాంటి మచ్చ లేకుండానే తిరిగివచ్చానని అన్నారు. ఎన్నికలకు ముందు తిరుపతిలోని తన విద్యాసంస్థలకు వస్తానని మాటిచ్చిన మోడీ ప్రధాని అయ్యాక మర్చిపోయారన్నారు. సినిమా రంగంలో ఉన్నానని తెలిసి అమ్మాయిని ఇచ్చేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments