చిరంజీవి సర్జా తొలి వర్థంతి.. నటి మేఘనా రాజ్‌ ఎమోషనల్ పోస్ట్

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (17:05 IST)
chiranjeevi Sarja
కన్నడ స్టార్‌ హీరో, దివంగత నటుడు చిరంజీవి సర్జా మృతి చెంది నేటితో ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్‌ ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. గతేడాది జూన్‌ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 
 
చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో జూనియర్‌ సర్జాకు ఆమె జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతడికి సంబంధించిన ప్రతి వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తున్నారు. 
 
అంతేగాక సర్జాతో తనకున్న జ్ఞాపకాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలో చిరు, మేఘనాలు మాట్లాడుకుంటుండగా ప్రేమతో ఆమెను చూస్తున్నట్లుంది. 
 
దీనికి మేఘన ఎమోషనల్‌ క్యాప్షన్‌తో హార్ట్‌ ఎమోజీని జోడించి అభిమానులను, నెటిజన్లను కదిలించారు. తన పోస్టు ప్రముఖ నటి, మేఘన సన్నిహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments