Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్, చిరంజీవి కోసం 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర.. ఎవరు..?

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (20:33 IST)
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వీరాభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. తాజాగా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని సైకిల్ యాత్ర ద్వారా చాటుకున్నారు. ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకుంటే 600 కిలోమీటర్లు ప్రముఖ ఆలయాలకు సైకిల్ యాత్ర చేస్తానని మొక్కుకున్నారు. 
 
తిరుపతికి చెందిన ఈశ్వర్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన కొంతమంది హీరోలు కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడగా వాళ్లు కోలుకుంటే కొండగట్టు ఆంజనేయస్వామి, తిరుమల వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మను సైకిల్ పై దర్శించుకుంటానని ఈశ్వర్ కోరుకున్నారు.
 
మెగా హీరోలు కరోనా నుంచి కోలుకోవడంతో ఈశ్వర్ తిరుపతి నుంచి సైకిల్ యాత్రను మొదలుపెట్టారు. తిరుపతి నుంచి విజయవాడకు అక్కడినుంచి కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ వరకు ఈశ్వర్ సైకిల్ యాత్ర చేపట్టారు. 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని తన కోరిక అని అందుకోసం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నానని ఈశ్వర్ తెలిపారు. ఈశ్వర్ సైకిల్ యాత్ర గురించి పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments