'ఓసి నా క్లాస్ కళ్యాణి... పెట్టవే మాస్ బిర్యాని' అంటున్న 'క్రాక్' రవితేజ

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (13:51 IST)
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం "క్రాక్"‌. ఈ మూవీ నుంచి మాస్ బిర్యానీ సాంగ్ లిరిక‌ల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. "ఓసి నా క్లాస్ క‌ల్యాణి... పెట్ట‌వే మాస్ బిర్యాని" అంటూ సాగే ఈ పాట ఊర మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపుతోంది. 
 
ర‌వితేజ ‌- శృతిహాస‌న్ కాంబినేష‌న్ మ‌రోసారి థియేట‌ర్ల‌లో ర‌చ్చ చేస్తుంద‌ని ఈ పాట చూస్తే తెలిసిపోతుంది. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను రాహుల్ నంబియార్, సాహితి చాగంటి పాడారు. ర‌వితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం క్రాక్ కావడంతో దీనిపై భారీ ఆశలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
కాగా, సర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి విక్టరీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలువ‌నుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తు.. భార్య ఇంటి వదిలి వెళ్లిపోయింది.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

Divya Suresh: కన్నడ నటి దివ్య సురేష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు

Montha Cyclone: మొంథా తుపాను.. అప్రమత్తంగా వుండాలి.. పవన్ ఆదేశాలు

ఫిబ్రవరి 25, 2026 నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

ఐదో తరగతి చదివాడు.. కానీ పదవ తరగతి సర్టిఫికేట్‌తో లైసెన్స్.. కర్నూలు బస్సు డ్రైవర్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments