శ్రీరెడ్డిపై ఎవరిని అడిగి నిషేధం విధించారు? ''మా'' పరువు పోతోంది : మంచు విష్ణు

టాలీవుడ్‌లో సంచలనంగా మారిన శ్రీరెడ్డిపై ఎవరిని అడిగి నిషేధం విధించారు.. మళ్లీ ఎవర్నడిగి నిషేధం ఎత్తివేశారంటూ.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌ను మంచు హీరో విష్ణు ప్రశ్నించాడు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియే

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (15:55 IST)
టాలీవుడ్‌లో సంచలనంగా మారిన శ్రీరెడ్డిపై ఎవరిని అడిగి నిషేధం విధించారు.. మళ్లీ ఎవర్నడిగి నిషేధం ఎత్తివేశారంటూ.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌ను మంచు హీరో విష్ణు ప్రశ్నించాడు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌పై మంచు విష్ణు నిప్పులు చెరిగాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో మా వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. 
 
మా అధ్యక్షుడు శివాజీరాజాకి లేఖాస్త్రం సంధించిన మంచు విష్ణు శ్రీరెడ్డి ఇష్యూలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వ్యవహరించిన తీరును నిలదీశారు. అసలు మాకెందుకు చెప్పలేదంటూ మంచు విష్ణు ఘాటుగా ప్రశ్నించారు. మాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గందరగోళంగా వున్నాయన్నారు.


900మంది ఉన్న ''మా''లో తమ కుటుంబ సభ‌్యులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా మంచు విష్ణు గుర్తు చేశారు. అనాలోచిత నిర్ణయాలతో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌పై ప్రజల్లో చులకన భావన ఏర్పడుతోందని మంచు విష్ణు ఘాటు కామెంట్స్‌ చేశారు.
 
అసలు నటీనటులకు సరైన మార్గదర్శకాలు ఎక్కడున్నాయంటూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌ను మంచు విష్ణు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 24 క్రాఫ్ట్‌లకు కూడా ఆ మార్గదర్శకాలను వర్తింపజేయాలని మంచు విష్ణు కోరాడు.

ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వంలేని అనేకమంది స్థానిక నటులు ఉన్నారని వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా? అంటూ విష్ణు నిలదీశారు. కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు టాలీవుడ్‌ పరువు తీసేస్తోందన్న విష్ణు ఫిర్యాదుల సెల్‌ ఏర్పాటు బాధ్యతను "మా" కాకుండా ఫిల్మ్‌ ఛాంబర్‌ తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments