"మోహన్ బాబు కూతురైతే ఏంటి?" అంటారు.. ఏం చేద్దాం: మంచు లక్ష్మి

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:34 IST)
రాష్ట్రంలోని సినిమా థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లో ఉంచుకుని ఇండస్ట్రీని శాసిస్తున్నరాని చాలాకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. తమకు సంబంధించిన సినిమాలను మాత్రమే ఎక్కువ రోజుల పాటు థియేటర్లలో ఉంచుతూ, మిగిలినవాటిని తీసేయడం వలన చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లు సాధించలేకపోతున్నాయి. ఇక సెలవులు, పండుగల సమయంలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. 
 
ఇటీవల మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్‌ను లాంచ్ చేసే వేడుకకు హాజరైన మంచు లక్ష్మి ఈ విషయంగా మాట్లాడారు. అస్సలు ఇప్పుడు సినిమాలు తీయాలంటేనే భయంగా ఉంది. నిర్మాతగా సినిమా తీసేటప్పుడు బాగానే ఉంది, కానీ దాన్ని విడుదల చేసే ప్రక్రియలో అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. థియేటర్లన్నీ ఆనలుగురి చెప్పు చేతల్లో ఉండటంతో విడుదల చేయడానికి థియేటర్లు దొరక్క ఇబ్బందుల పాలు కావలసి వస్తోంది. 
 
ఒక సినిమా తీయాలంటే సుమారు సంవత్సరం రోజుల పాటు టెక్నీషియన్లందరూ కష్టపడాలి. అంత కష్టపడిన తీసిన సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తే మరో సినిమా విడుదలవుతోందని తీసేయడం చాలా బాధగా ఉంది. ఈ విషయంలో చిన్న, పెద్ద చూడరు. మోహన్ బాబు కూతురైతే ఏంటి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. వెబ్ సిరీస్‌లలో అయితే ప్రయోగాలు చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే ఇది మంచి ప్లాట్‌ఫారమ్, భవిష్యత్తులో వీటి హవా నడుస్తుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments