Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్‌ బాబుకు నో చెప్పిన హీరోయిన్... కారణం అదేనా?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:29 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో నటించడానికి దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఏ హీరోయిన్ అయినా భవిస్తారు. ఇక కొంత మంది హీరోయిన్లు అయితే ఒక్క సినిమాలో అయినా ఆయన పక్కన చేయాలని తపిస్తూ ఉంటారు. కానీ ఓ సినిమాలో ప్రిన్స్‌కు జోడీగా నటించే అవకాశం వస్తే ఒక హీరోయిన్ నో చెప్పిందని సినీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి అంట.
 
మహర్షి సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ తదుపరి సినిమా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని సెలెక్ట్ చేసిందట చిత్రం యూనిట్. సాయి పల్లవి పేరును స్వయంగా మహేశ్ చెప్పడంతో దర్శకుడు అనిల్ రావిపూడి సాయిపల్లవికి కథ చెప్పగా ఆమె నో చెప్పిందట. 
 
గతంలో కూడా ఈమె చాలా డైరెక్టర్లకు నో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన రోల్ ప్రాధాన్యత గురించి ఆలోచించి సాయి పల్లవి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలా చేసినా కూడా మారి 2, పడి పడి లేచే మనస్సు నిరాశపరచడంతో సినిమా ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతోందట. ఇక సాయి పల్లవి నో చెప్పడంతో రష్మిక మందాన, కత్రినా కైఫ్ పేర్లు వినిపిస్తున్నాయంట.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments