Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో ఎంజాయ్ చేస్తున్న మలయాళ కుట్టి... ఆ సంగతేంటో చూస్తారా?

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:36 IST)
మలయాళ కుట్టి నయనతార ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోందట. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటలోను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ విషయాన్ని ఇద్దరూ మీడియా ముందు పరోక్షంగా చెప్పారనుకోండి. నయన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్‌ తరచూ పోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండటం కూడా వీరి బంధానికి బలం చేకూరుస్తున్నాయి.

ఆ ఫొటోలు చూసిన వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు వారు రిలేషన్‌లో ఉన్నారని. ఇప్పుడు విఘ్నేశ్‌ కుటుంబసభ్యులతో కలిసి నయనతార గోవా ట్రిప్‌ భలే ఎంజాయ్ చేస్తోంది. విఘ్నేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు ట్విటర్‌లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

నయనతార తెలుపు రంగు గౌనులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పువ్వులు కోస్తూ కనిపించింది. 'తెలుపు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది' అని నయన్‌ ఫొటోలకు విఘ్నేశ్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. తన తల్లి స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలనూ షేర్‌ చేశారు.

'అమ్మ ముఖంలో చిరునవ్వు నేరుగా మన హృదయాల్ని తాకుతుంది. మన తల్లిదండ్రుల సంతోషానికి మించిన సంతృప్తి, ఆనందం మరొకటి ఉండదు. ఓ విధంగా చెప్పాలంటే.. మన జీవిత లక్ష్యమే వారిని సంతోషంగా ఉంచడం' అని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments