Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం' : కత్తి మహేష్ ట్వీట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం అంటూ ట్వీట్స్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (10:28 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం అంటూ ట్వీట్స్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. 
 
'అజ్ఞాతవాసి' చిత్రం విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దూకిన విషయం తెల్సిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. పవన్ పర్యటనకు అనూహ్య స్పందన వస్తోంది. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. "తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవల్‌లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు" అంటూ వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు పవన్ ఉద్దేశించి అయి ఉంటాయని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments