Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ కొత్త చిత్రం టైటిల్ అదే... మరో హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్

Webdunia
ఆదివారం, 31 మే 2020 (12:17 IST)
ప్రిన్స్ మహేష్ బాబు 27వ చిత్రంపై అధికారిక ప్రకటన ఆదివారం వెలువడింది. తన తండ్రి, సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని, ఈ చిత్రం టైటిల్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం టైటిల్‌ను "సర్కారి వారి పాట"గా ఖరారు చేశారు. ఈ టైటిల్ లోగోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత మహేష్ బాబు మరో ప్రాజెక్టును అంగీకరించలేదు. దీంతో కొత్త ప్రాజెక్టు ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం మ‌హేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌పై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
ఈ చిత్రానికి "గీత గోవిందం" ఫే పరశురాం దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. 
 
మరోవైపు సర్కారి వారి పాట అధికారిక పోస్టర్ ఆదివారం ఉదయం 9.09 నిమిషాలకు విడుదల కాగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. 'సర్కారు వారి పాట' టైటిల్ యునీక్‌గా, సూపర్బ్‌గా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటనతోనే మహేశ్ బాబు సినీ కెరీర్‌లో మరో హిట్ పడిపోయిందని అంటున్నారు.
 
మరికొందరు అభిమానులైతే, 'మరో హ్యాట్రిక్ కోసం బ్లాక్ బస్టర్ మొదలు' అంటూ ఈ పోస్టర్‌పై మహేశ్ బాబు కామెంట్ పెట్టారు. ఇక ఫ్యాన్స్ అయితే, 'మాసివ్ మేకోవర్ లోడింగ్... ఒక్కొక్కడికీ గజం దింపుదాం అన్నా' అని, 'ఇక థియేటర్లలో పొర్లు దండాలే' అని కామెంట్లు పెడుతున్నారు. 
 
కాగా, ఈ టైటిల్ లోగోతో పాటు మహేష్ బాబు స్టిల్‌ను కూడా రిలీజ్ చేశారు. మహేశ్ బాబు ముఖాన్ని కొంత భాగం చూపించారు. ఆయన మెడపై రూపాయి బిళ్ల పచ్చబొట్టు పొడిపించుకుని ఉండడం ఇందులో చూడొచ్చు. అలాగే, చెవిపోగు, కొత్త హెయిర్‌ స్టైల్‌తో మహేశ్ కనపడుతుండటం గమనార్హం. గతంలో వచ్చిన పోకిరి చిత్రం తరహాలో ఈ స్టిల్ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments