Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'కి గుమ్మడికాయ కొట్టేశారు.. బోరున ఏడ్చిన హీరోయిన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన సొంత బ్యానర్‌ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "మహానటి". అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (18:35 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన సొంత బ్యానర్‌ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "మహానటి". అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఈనెల 21వ తేదీన గుమ్మడికాయ కొట్టేశారు. అంటే చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈనేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్ మాట్లాడుతూ, 'మాటెక్నికల్ టీమ్ ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేయడమేకాక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని మిగుల్చుతుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా "మహానటి" వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి మా బ్యానర్‌లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
 
ముఖ్యంగా, సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు ఎప్పటికీ ఋణపడి ఉంటాం. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో భాగంగా సావిత్రిగారి పటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో మా హీరోయిన్ కీర్తి సురేష్ కన్నీరు పెట్టుకొంది. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుతుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments