Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించిన కరాటే కళ్యాణి.. "మా" నోటీసులు

Webdunia
గురువారం, 18 మే 2023 (10:58 IST)
కృష్ణుడి రూపంలో ఉన్న స్వర్గీయ ఎన్.టి.రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని సినీ నటి కరాటే కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న కరాటే కళ్యాణి... ఖమ్మంలోని లంకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి రూపంలో ఉండే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలంటూ డిమాంట్ చేస్తున్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి విగ్రహంతో కమ్మ, యాదవులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దన్నారు. దీన్ని సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియ అంటూ ఆరోపించారు. అయితే, కల్యాణి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
ఈ వ్యాఖ్యాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కన్నెర్రజేసింది దివంగత సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కల్యాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరి ఆమె ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సివుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments