Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజలకు సేవ చేయాలనివుంది... ఎంపీ నవనీత్ కౌర్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (10:48 IST)
తనకు ఒక నటిగా గుర్తింపునిచ్చింది తెలుగు ప్రజలేనని, అలాంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలని వుందని సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ చెప్పుకొచ్చారు. ఆమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింద‌ని చెప్పారు. అందుకే తాను ఈ రోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నట్టు చెప్పారు. 
 
తాను తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌కు సాయం చేస్తాన‌ని అన్నారు. దేశంలో కొవిడ్ విజృంభ‌ణ త‌గ్గి ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉండాల‌ని శ్రీ‌వారిని మొక్కుకున్న‌ట్లు తెలిపారు.
 
మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నవనీత్ కౌర్... గత లోక్‌సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఆమె ఎస్సీ కాదని తీర్పునిచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, ఆమెకు ఊరటనిచ్చేలా తీర్పు వచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments