Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రైడ్ రైస్‌లో చచ్చిన బొద్దింక ... ఫోటోతో షేర్ చేసిన నివేదా పేతురాజ్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (16:47 IST)
అనేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆ రెస్టారెంట్లు తయారు చేసే ఆహార నాణ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా ఓ రెస్టారెంట్‌ సరఫరా చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో ఆ కష్టమర్ షాక్‌కు గురయ్యారు. ఆ కష్టమరో ఎవరో కాదు... హీరోయిన్ నివేదా పేతురాజ్. 
 
ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక ఉండటంతో రెస్టారెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదా బుధవారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంది. 
 
డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్శిల్ తెరవగానే ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ఓ చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దాంతో నివేదా మండిపడ్డారు. సదరు రెస్టారెంట్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేశారు. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. ఫ్రైడ్ రైస్‌లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments