Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్‌లో ఇదే నా డ్యూటీ : చిరంజీవి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:55 IST)
కరోనా వైరస్ గొలుసు కట్టును అడ్డుకునేందుకు దేశం లాక్‌డౌన్‌లో ఉంది. 130 కోట్ల మంది ప్రజానీకం ఇపుడు తమతమ గృహాలకే పరిమితమైవున్నారు. ఈ విషయంలో పేదోడు.. సెలెబ్రిటీ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో ఉంటున్నారు. అయితే, సెలెబ్రిటీలు లాక్‌డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో తమ ఇంటి పనుల్లో నిమగ్నమైవున్నారు. వాటిని వారు ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్లో తాను చేస్తున్న పనులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాజాగా త‌న ఇంట్లోని మొక్క‌ల‌కి నీళ్లు ప‌డుతూ కనిపించాడు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ ఫోటో కింద "మొక్కే క‌దా అని వ‌దిలేస్తే.." అని తాను నటించిన "ఇంద్ర" సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌ని జ‌త చేశాడు. షూటింగ్ లేని కార‌ణంగా ప్ర‌తి రోజు ఇదే నా డ్యూటీ అంటూ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు చిరు. ఆయ‌న ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో "ఆచార్య" అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments