Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 1న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల అనుమానమే...

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:38 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మే ఒకటో తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ రోజున కూడా విడుదల కావడం ఇపుడు సందేహాస్పదంగా మారింది.
 
ఎందుకంటే గతంలో ఈ చిత్రం విడుదల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులే దీనికి కారణం. ఏపీలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదలకు సంబంధించి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంతవరకు తాము గతంలో జారీచేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 
 
ఈ విషయమై చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డికి ఏప్రిల్‌ 10వ తేదీన ఈసీ లేఖ రాసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ సినిమాను విడుదల చేయవద్దని ఆదేశించింది. కోడ్‌ ముగిసే వరకు ఎన్నికలకు విఘాతం కలిగించే బయోపిక్‌లు ప్రదర్శించవద్దని నిబంధనల్లో ఉన్నట్లు పేర్కొంది.
 
కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఏకపక్షంగా మే ఒకటో తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అదీకూడా ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తొలుత ఈ సినిమాను మార్చిలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీశారంటూ ఈసీకి ఫిర్యాదులు అందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments