Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 1న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల అనుమానమే...

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:38 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మే ఒకటో తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ రోజున కూడా విడుదల కావడం ఇపుడు సందేహాస్పదంగా మారింది.
 
ఎందుకంటే గతంలో ఈ చిత్రం విడుదల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులే దీనికి కారణం. ఏపీలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదలకు సంబంధించి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంతవరకు తాము గతంలో జారీచేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 
 
ఈ విషయమై చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డికి ఏప్రిల్‌ 10వ తేదీన ఈసీ లేఖ రాసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ సినిమాను విడుదల చేయవద్దని ఆదేశించింది. కోడ్‌ ముగిసే వరకు ఎన్నికలకు విఘాతం కలిగించే బయోపిక్‌లు ప్రదర్శించవద్దని నిబంధనల్లో ఉన్నట్లు పేర్కొంది.
 
కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఏకపక్షంగా మే ఒకటో తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అదీకూడా ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తొలుత ఈ సినిమాను మార్చిలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీశారంటూ ఈసీకి ఫిర్యాదులు అందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments