Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగం చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ ఇకలేరు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (08:46 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ ఇకలేరు. ఈయన జీవా హీరోగా వచ్చిన రంగం చిత్రానికి దర్శకత్వం వహించి, తన సత్తాచాడు. ఈ క్రమంలో ఆయన గురువారం గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. 
 
చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ‌లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. క‌ల్కి, ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ను క‌లిసి ఆయ‌న సినిమాటోగ్ర‌ఫీలో శిష్యుడిగా మారారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ వ‌హించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది. 
 
ఆ తర్వాత తమిళంలో 'కణా కండేన్' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, దర్శకుడుగా అవతారమెత్తారు. ఆపై జీవా హీరోగా కో (తెలుగులో రంగం)తో ఆయనసత్తా ప్రేక్షకులకు తెలిసింది.
 
తర్వాత మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు, కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణం కోలీవుడ్ కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Bandla Ganesh: బాబును కలిసిన బండ్ల- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్

జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments