Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలను కుక్కి... మహారాష్ట్రలో కరోనా మృత్యుక్రీడ

ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలను కుక్కి... మహారాష్ట్రలో కరోనా మృత్యుక్రీడ
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:14 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ మృత్యుక్రీడ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఇప్పటికే రికార్డుకెక్కిన మహారాష్ట్ర మృతుల్లోనూ అదేపరిస్థితి కొనసాగుతోంది. దీనికి నిదర్శనమే పై ఫోటో. ఒక అంబులెన్స్‌లో మహా అయితే ఒకటి లేదు రెండు మృతదేహాలను తీసుకొస్తారు. కానీ, ఇక్కడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కరోనా మృతదేహాలను ఒకే ఒక్క అంబులెన్సులో కుక్కి పంపించారు అధికారులు. అదేమని అడిగితే నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు తీసిన వారి బంధువుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగిచ్చారు. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో జరిగింది. దీనిపై అధికారులు స్పందించారు. అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా మృతదేహాలను తీసుకెళ్లినట్టు చెప్పారు.
webdunia
 
‘‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమసంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం’’ అని ఆసుపత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర అన్నారు.
 
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిబా అదనపు కలెక్టర్‌ను ఆదేశించినట్టు బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టిన నర్సు.. పని ఒత్తిడిని తట్టుకోలేకనే..?