Webdunia - Bharat's app for daily news and videos

Install App

RC 15 గురించి కైరా అద్వానీ ఏమన్నదో తెలుసా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:10 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది కైరా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ జోడీగా వినయ విదేయ రామ చిత్రంలో మెరిసింది.
 
ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు కైరా. ప్రస్తుతం ఈ అమ్మడు భూల్ భూలయ్యా 2 సినిమా హిట్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆర్సీ 15 గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వర్క్ చేయడం ప్రత్యేక అనుభవమంటూ చెప్పుకొచ్చింది కైరా. 
 
డైరెక్టర్ శంకర్ ఎలాంటి కథైనా.. పాత్రనైనా అద్భుతంగా మార్చగలరు. సినిమాను మ్యాజిక్ చేస్తాడు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభవం. ఇది తన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నానని అంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments