‘మహానటి’కి మరో చరిత్రాత్మక పాత్ర... అదేంటంటే?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:52 IST)
‘మహానటి’ సినిమాలో సావిత్రమ్మ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అన్నట్లు నటించి అందరి చేతా ప్రశంసలు అందుకున్న కీర్తిసురేష్‌కు మరో చారిత్రాత్మకమైన పాత్రను పోషించే అవకాశం వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో కుందవై నాచ్చియార్‌ పాత్రకు కీర్తి సురేష్‌ ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

ఎంజీఆర్‌ నుండి కమల్‌ హాసన్‌ వరకు పలువురు అగ్రహీరోలు ఈ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరింపజేయాలని ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మణిరత్నం కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. 
 
ఎట్టకేలకు ఈ ఏడాదిలోనే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు రూ.200 కోట్ల ఉండవచ్చునని సమాచారం. కోలీవుడ్‌ సమాచారం మేరకు అమితాబ్‌ బచ్చన్‌, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌, మోహన్‌బాబు, కీర్తి సురేష్‌లు ప్రధాన తారాగణంగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరి పూర్తి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో వేచి చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments