Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై శ్రుతిహాసన్‌ రీఎంట్రీ.. విజయ్ సేతుపతికి జోడీగా?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:42 IST)
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రుతిహాసన్‌ మళ్లీ వెండితెరపై కనిపించాలని ఆరాటపడుతోంది. విశ్వనటుడు కమల్‌హాసన్‌‌కి వారసురాలిగా ప్రారంభమైన ఆవిడ కెరీర్‌ మొదట్లో కాస్త జోరు మీద కనిపించినప్పటికీ... వరుస పరాజయాలు ఆవిడని నిరాశ పరిచాయి.


అదే సమయంలో పెళ్లి వార్తలు కూడా ఆమె కెరీర్‌కు ఆటంకంగా మారడంతో... దాదాపు రెండేళ్లుగా శ్రుతి సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. బ్రేక్ తర్వాత తనకెంతో ఇష్టమైన సంగీత రంగంలోనే ముందుకు సాగాలని భావించినప్పటికీ, ఆమె మనసు మళ్లీ సినిమాలపైకే మళ్లినట్టు తెలుస్తోంది.
 
ఈ మేరకు సీనియర్‌ దర్శకుడు ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న కొత్త చిత్రంలో శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

జననాథన్‌ సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు చాలా వరకు గ్లామరస్‌ పాత్రలలోనే నటించిన శ్రుతి తన ఇమేజ్‌‌ని మార్చుకునే నిర్ణయంతోనే కథలను ఎంచుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మరి... ఇది ఏ మేరకు విజయం సాధించి పెడ్తుందో అదీ చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments