Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (12:39 IST)
హీరోయిన్ కీర్తి సురేష్ తన తల్లిదండ్రులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కీర్తి సురేష్ త్వరలోనే వివాహం చేసుకోనున్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను నటించిన "బేబీజాన్" హిందీ చిత్రం విడుదలకానుందని, ఆ తర్వాత వచ్చే నెలలో తన పెళ్లి జరుగనుందని, అందుకే కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
కాగా, తన పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ప్రియుడు ఆంటోనీతో దీపావళి పండుగ సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోను తన ఇన్‌‍స్టాలో షేర్ చేశారు. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలెబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వీరిద్దరూ వచ్చేనెల వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. డిసెంబరు 11, 12వ తేదీల్లో గోవాలో జరుగనుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments