Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహనీయులు తరహాలోనే జైలుకెళతా : కంగనా రనౌత్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:46 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆదర్శప్రాయమైన మహనీయుల మాదిరిగానే తాను కూడా జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా ద్వారా కంగన, ఆమె సోదరి రంగోలీ వ్యాఖ్యలు చేస్తున్నారని ముంబై కోర్టులో ఇటీవల పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇక, మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వీరిద్దరూ వచ్చేవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది.  
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ స్పందిస్తూ, 'నేతాజీ, సావర్కర్, ఝాన్సీ రాణి వంటి వారిని నేను ఆరాధిస్తాను. ఈ రోజు ప్రభుత్వం నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలనుకుంటోంది. నేను జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. నాకు ఆదర్శనీయులైన వ్యక్తులు ఎదుర్కొన్న కష్టాలను నేనూ ఎదుర్కోవాలనుకుంటున్నాను. అప్పుడే నా జీవితానికి కొంత అర్థం ఏర్పడుతుంది. జైహింద్' అని పేర్కొంది. 
 
అలాగే రాణీ లక్ష్మీబాయి కోటను కూలగొట్టినట్టే ముంబైలో తన ఇంటిని పడగొట్టారని, ఇప్పుడు తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించిన సభ్యులను.. వారు ఇక్కడ ఎదుర్కొన్న కష్టాలేంటో ఎవరైనా అడిగితే బాగుణ్ను అంటూ ట్వీట్ చేసి దానిని హీరో ఆమిర్ ఖాన్‌కు ట్యాగ్ చేసింది. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments