Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.48 కోట్లతో ఖరీదైన ఆఫీసు.. ధనిక నటిగా అవతరించడమే లక్ష్యం (video)

Webdunia
శనివారం, 30 మే 2020 (14:02 IST)
హిందీ చిత్ర పరిశ్రమలో డేరింగ్, డాషింగ్ హీరోయిన్లలో ఒకరు కంగనా రనౌత్. ఆమె మాట్లాడే మాటేకాదు.. చేసే చర్య కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. అందుకు ఉదాహరణే గతంలో అనేక బోల్డ్ క్యారెక్టర్లలో నటించింది. వాటిపై ఎన్ని విమర్శలు వచ్చినా ధీటుగా ఎదుర్కొంది. అనేక వివాదాస్పద చిత్రాలను నిర్మించింది. అలాంటి కంగనా రనౌత్.. ఇపుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయ్యేలా రూ.48 కోట్ల వ్యయంతో ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది. ఇపుడు సోషల్ మీడియాలో ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. 
 
ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ, చేతిలో కేవలం రూ.1500తో ఇంటి నుంచి బయటకు వచ్చాను. డబ్బు సంపాదించడానికే మా ఊరు నుంచి ముంబై వచ్చాను. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ డబ్బు సంపాదిస్తే జీర్ణించుకోలేరు. ఎన్నో పోరాటాల తర్వాత పెద్ద స్టార్‌గా ఎదిగానని తెలిపింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అత్యంత ధనికురాలిగా నిలవడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. 
 
కాగా, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యత అధికం. అలాంటి రంగంలో ఓ మహిళగా తనదైన ముద్రను వేసింది. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇవ్వకపోయినా అంచలంచెలుగా అగ్ర నటిగా ఎదిగింది. ముఖ్యంగా, ఇతరులు నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తోంది. ఏది ఏమైనా.. కంగనా అంటే ఓ ట్రెండ్ సెట్టర్. 
 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments