ఎల్లలు దాటిన సోనూ సూద్ ఉదార స్వభావం... వలస కార్మికుల కోసం...

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (22:57 IST)
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సోనూ సూద్. ఈయన ఉదారస్వభావం ఇపుడు ఎల్లలుదాటిపోయింది. వలస కార్మికుల కోసం మొన్న పలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇపుడు ఏకంగా ప్రత్యేక విమానాన్నే నడిపారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వలస కార్మికులు చిక్కుకునిపోయారు. వీరంతా ఉపాధి లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మందిని సోనూ సూద్ తన సొంత ఖర్చులపై ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 
 
ఇపుడు మరోమారు ఉదారస్వాభావాన్ని ప్రదర్శించారు. తాజాగా కేరళలో చిక్కుకుపోయిన 177 మంది మహిళా వలసజీవులను ఒడిశా తరలించేందుకు సోనూ ఈ పర్యాయం వాయు మార్గాన్ని ఎంచుకున్నారు.
 
ఒడిశాకు చెందిన ఆ మహిళలంతా కొచ్చిలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే లాక్డౌన్ ప్రకటించడంతో ఉపాధి లేక, తినడానికి ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. 
 
భువనేశ్వర్‌లోని ఓ స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు తెరిచి ఉంచడం కోసం అనుమతులు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments