Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ మహాపురుషుడు - బీజేపీ కోరితే రాజకీయాల్లోకి : కంగనా రనౌత్

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:51 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మనస్సులో మాటను బహిర్గతం చేశారు. భారతీయ జనతా పార్టీ టిక్కెట్ ఇస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. పైగా, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉందంటూ తన మనస్సులోని మాటను వెల్లడించారు. పనిలోపనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను మహాపురుషుడిగా సంబోధించారు. 
 
తాజాగా ఆమె ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవకాశం వస్తే హిమాచల్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, బీజేపీ టిక్కెట్ ఇస్తేనే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తానని ప్రకటించారు. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ జాతీయభావం కనిపిస్తుందన్నారు. తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోడీ పనితీరుతో ఇపుడు తమ కుటుంబం బీజేపీ వైపు నిలిచిందన్నారు.
 
తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అదేసమయంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీదారు కానేకాదు అని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments