Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ మహాపురుషుడు - బీజేపీ కోరితే రాజకీయాల్లోకి : కంగనా రనౌత్

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:51 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మనస్సులో మాటను బహిర్గతం చేశారు. భారతీయ జనతా పార్టీ టిక్కెట్ ఇస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. పైగా, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉందంటూ తన మనస్సులోని మాటను వెల్లడించారు. పనిలోపనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను మహాపురుషుడిగా సంబోధించారు. 
 
తాజాగా ఆమె ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవకాశం వస్తే హిమాచల్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, బీజేపీ టిక్కెట్ ఇస్తేనే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తానని ప్రకటించారు. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ జాతీయభావం కనిపిస్తుందన్నారు. తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోడీ పనితీరుతో ఇపుడు తమ కుటుంబం బీజేపీ వైపు నిలిచిందన్నారు.
 
తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అదేసమయంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీదారు కానేకాదు అని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments