Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కోర్కె నెరవేరాక చనిపోయినా ఫర్వాలేదు : సూపర్ స్టార్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా చిత్రం "కాలా" ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:42 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా చిత్రం "కాలా" ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన భార్య లతా రజనీకాంత్, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌లతో కలిసి రజనీ ఈ కార్యక్రమానికి వచ్చారు.
 
ఈసందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, తాను తరచూ హిమాలయాలకు వెళ్లడానికి కారణమేంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. గంగానది రౌద్రాన్ని, అందాన్ని చూడటానికే తాను హిమాలయాలకు వెళ్లి వస్తుంటానని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఈ పని ముగిసిన తర్వాత చనిపోయినా ఫర్వాలేదని సూపర్ స్టార్ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, 'శివాజీ' సక్సెస్ మీట్‌కు అతిథిగా వచ్చిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పిన మాటలు తనకు ఇంకా వినిపిస్తున్నాయని, ఆయన మాట కోసం తాను కూడా అందరిలో ఒకడిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ ఫంక్షన్ ఆడియో వేడుకలా లేదని, సినిమా విజయోత్సవ సభలా అనిపిస్తోందన్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

నా ప్రేమ అంగీకరించవా? చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ బాలిక మెడపై కత్తి పెట్టిన ఉన్మాది (video)

పరుపులోకి దూరిన కొండచిలువు - కుక్కల అరుపులతో మేల్కొన్న యువకుడు

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments