Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కోర్కె నెరవేరాక చనిపోయినా ఫర్వాలేదు : సూపర్ స్టార్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా చిత్రం "కాలా" ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:42 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా చిత్రం "కాలా" ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన భార్య లతా రజనీకాంత్, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌లతో కలిసి రజనీ ఈ కార్యక్రమానికి వచ్చారు.
 
ఈసందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, తాను తరచూ హిమాలయాలకు వెళ్లడానికి కారణమేంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. గంగానది రౌద్రాన్ని, అందాన్ని చూడటానికే తాను హిమాలయాలకు వెళ్లి వస్తుంటానని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఈ పని ముగిసిన తర్వాత చనిపోయినా ఫర్వాలేదని సూపర్ స్టార్ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, 'శివాజీ' సక్సెస్ మీట్‌కు అతిథిగా వచ్చిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పిన మాటలు తనకు ఇంకా వినిపిస్తున్నాయని, ఆయన మాట కోసం తాను కూడా అందరిలో ఒకడిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ ఫంక్షన్ ఆడియో వేడుకలా లేదని, సినిమా విజయోత్సవ సభలా అనిపిస్తోందన్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments