Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జిల్'' రాధాకృష్ణ కోసం కొండలెక్కనున్న ప్రభాస్.. ఎందుకు?

''బాహుబలి'' సినిమాలో తమన్నా (అవంతిక) కోసం కొండలెక్కిన ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో చేసే సినిమా కోసం కొండలెక్కనున్నాడట. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాకు సంబంధించిన

Webdunia
గురువారం, 10 మే 2018 (11:14 IST)
''బాహుబలి'' సినిమాలో తమన్నా (అవంతిక) కోసం కొండలెక్కిన ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో చేసే సినిమా కోసం కొండలెక్కనున్నాడట. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ అబుదాబిలో చిత్రీకరించబడుతున్నాయి. ఈ సినిమా తరువాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. 
 
ఈ సినిమా కోసమే ప్రభాస్ కొండలనెక్కనున్నాడని టాక్. కథానాయిక కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ.. ఇవే సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. హీరోయిన్ వెదుక్కుంటూ కొండలెక్కి, ఆమెను కనుగొనే విధంగా స్క్రిప్ట్ వుంటుందట. ఈ సినిమా షూట్ మాత్రం కొండ కోనల్లో వుంటుందని తెలుస్తోంది.
 
అలాగే టాలీవుడ్‌లో ట్రెక్కింగ్ టైపు సినిమాలు తక్కువ. ఎవడే సుబ్రహ్మణ్యం కొంత వరకు కవర్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా కాస్త ఎక్కువగానే కవర్ చేస్తుందని సినీ పండితులు అంటున్నారు. కాగా జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించే సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments