Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' తర్వాత 'రంగస్థల'మే...

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా, ఈ చిత్రం రూ.2000 కోట్ల కలెక్షన్లను అధికమించింది.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:06 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా, ఈ చిత్రం రూ.2000 కోట్ల కలెక్షన్లను అధికమించింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఓ బుక్ రూపంలో రూపుదిద్దుకుంటోంది. ఇపుడు 'నాన్ బాహుబ‌లి' మూవీగా ప‌లు రికార్డులు సృష్టించిన "రంగ‌స్థ‌లం" చిత్రం త్వ‌ర‌లో ఓ బుక్ రూపంలో రాబోతుంద‌ని తాజా స‌మాచారం.
 
రాంచ‌ర‌ణ్, స‌మంత, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా విడుద‌లైన ఈ చిత్రం రూ.200 కోట్ల భారీ వ‌సూళ్ళ‌ని సాధించి ఇంకా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టిస్తుంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర‌లో రాంచ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో స‌మంత క‌నిపించి అల‌రించారు. నాన్ బాహుబ‌లి మూవీగా ప‌లు రికార్డులు సృష్టించిన 'రంగ‌స్థ‌లం' చిత్రం త్వ‌ర‌లో ఓ బుక్ రూపంలో రాబోతుంద‌ని తాజా స‌మాచారం. 
 
ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ ఇందులోని పాత్ర‌ల‌కి సంబంధించి ఓ బుక్ త‌యారు చేయాల‌ని భావించాడ‌ట‌. ఇందుకు సంబంధించి స‌న్నాహ‌ల‌లో ఉన్నాడ‌ని టాక్‌. బాహుబ‌లి సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ 'రంగ‌స్థ‌లం' సినిమాకి సంబంధించి బుక్ రూపొందించ‌డం గొప్ప విశేష‌మే అని చెప్ప‌వ‌చ్చు. 'రంగ‌స్థ‌లం' చిత్రం కోసం సుకుమార్ ఓ విలేజ్ సెట్ క్రియేట్ చేయ‌గా, ఇప్ప‌టికి ఇదీ చూప‌రుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments