Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తగ్గని ప్రేక్షకుల సందడి.. లాభాల పంట పండిస్తున్న "రంగస్థలం"

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఈ చిత్రం తరహాలో మరేచిత్రం

తగ్గని ప్రేక్షకుల సందడి.. లాభాల పంట పండిస్తున్న
, సోమవారం, 7 మే 2018 (16:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఈ చిత్రం తరహాలో మరేచిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించలేదు.
 
పైగా, ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఉండటంతో ఒక్కసారి చూసిన ప్రేక్షకుడు సైతం మళ్లీమళ్లీ థియేటర్‌కు వచ్చేలా చేస్తోంది. కథతో పాటు.. పాటలు, కథనం, ఫైట్స్ ఇలా అన్ని విధాలుగా చిత్రం బాగుంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ కారణంగా ఈ సినిమా లాభాల పంట పండిస్తూ వెళుతోంది.
 
నిజానికి ఈ చిత్రం విడుదలకు ముందే రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత ఈ సినిమా రూ.120 కోట్ల షేర్‌ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో రూ.18 కోట్లకు అమ్ముడు కాగా, 34 రోజుల్లో రూ.27 కోట్లను వసూలు చేసింది. సీడెడ్‌లో రూ.12 కోట్లకు అమ్ముడుపోగా, ఇక్కడ రూ.17 కోట్లను రాబట్టింది. 
 
ఉత్తరాంధ్రలో రూ.8 కోట్లకి పోయిన ఈ సినిమా, రూ.12.08 కోట్ల షేర్‌ను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లకి పోగా రూ.16.5 కోట్ల షేర్ వచ్చింది. ఇలా ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంటూ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్‌గా నిలిచింది. మొత్తానికి చరణ్ ఈ ఏడాది మాస్ ఆడియన్స్‌కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాస్టింగ్ కౌచ్‌పై ఘాటు సమంత.. పెళ్ళైంది.. పిల్లలు పుట్టినా నటిస్తూనే వుంటా..