Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ ''కథానాయకుడు''కి యంగ్ టైగర్ వాయిస్ ఓవర్

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (12:03 IST)
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో తొలి భాగమైన కథానాయకుడుకి సంబంధించిన సన్నివేశాలు, పాటలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన చిత్రీకరణ చాలావరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషించనున్నట్టు తెలుస్తోంది. కానీ తొలిభాగం చిత్రీకరణ దాదాపు పూర్తయిన తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించట్లేదని కూడా టాక్ వస్తోంది. 
 
ఈ సినిమా ఆరంభంలో ఎన్టీరామారావు గురించిన వాయిస్ ఓవర్ ఉంటుందట. ఆ వాయిస్ ఓవర్‌ను యంగ్ ఎన్టీఆర్‌తో చెప్పించాలనే ఆలోచనలో టీమ్ ఉందని టాక్. అదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవరే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా వుంటుందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నా కనిపిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. దివంగత నేత ఎన్టీఆర్ జీవిత కథతో, బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న రెండు భాగాల చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నాడు.


ఈ చిత్రంలో భరత్ రెడ్డి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ వెనక నిలబడి ఉన్న దగ్గుబాటిగా భరత్ రెడ్డి అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, దగ్గుబాటి మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments