Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయదశమికి లక్ష్మీస్ ఎన్టీఆర్‌.. శ్రీవారి పాదాలచెంత..?: వర్మ

తాజాగా ముంబైకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తామని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు

విజయదశమికి లక్ష్మీస్ ఎన్టీఆర్‌.. శ్రీవారి పాదాలచెంత..?: వర్మ
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (18:53 IST)
నందమూరి బాలకృష్ణ తన స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ పేరుతో రెండు భాగాలుగా తన తండ్రి బయోపిక్ రూపొందించే పనిలో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాపై వివరాలను ఆర్జీవీ ప్రకటించలేదు. 
 
తాజాగా ముంబైకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తామని ప్రకటించారు. విజయదశమికి ఈ సినిమాను ప్రారంభించి.. జనవరి చివరికల్లా షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. అక్టోబర్ 19న పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడు‌లతో కూడిన పాత పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎన్టీఆర్ ట్రూ స్టోరీ అనే హ్యాష్‌‌ట్యాగ్‌ను జోడించారు. 
 
అంతేగాకుండా.. తొలిసారి తన సినీ కెరీర్‌లో ముహూర్తం చూసుకుని, ఖరారు చేసుకుని ప్రారంభిస్తున్న సినిమా ఇదని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అది కూడా కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. ఎన్టీఆర్‌పై వున్న గౌరవంతో ఆ పనిచేస్తున్నానని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ టూకు మిషెల్, మెలానియా మద్దతు.. ప్రపంచంలో ఆమే ఎక్కువ?