Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్..

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (10:26 IST)
కేజీఎఫ్ దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్టుగా ప్రశాంత్ కథని సిద్ధం చేస్తుండగా, 2021 చివరలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. 
 
భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నారు. ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. 
 
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments