Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్' హౌస్‌కు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్లు.. ఇక సందడే సందడి...

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ముగింపు దశకు చేరుకోనుంది. ఈ షోలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా, మరికొందరు ఇం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (12:03 IST)
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ముగింపు దశకు చేరుకోనుంది. ఈ షోలో పలువురు నటీనటులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా, మరికొందరు ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు.
 
అదేసమయంలో ప్రతి శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉండే కొత్త చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు ఈ హౌస్‌లోకి ప్రవేశిస్తూ మరింత సందడి చేస్తున్నారు. ఈ కోవలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కొత్త చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన రిలీజ్ కానుంది. 
 
ఇందులో హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించారు. ఈ నటీమణులిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో వీరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదేసమయంలో శనివారం కావడంతో, జూనియర్ కూడా షోలో కనిపించనున్నాడు. 
 
మరోవైపు, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ప్రచారంలో భాగంగా నివేదా, రాశీ ఖన్నాలు బిగ్ బాస్‌లో సందడి చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments