Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఘాట్‌కు రావట్లేదు.. మీరూ రావొద్దు.. ఫ్యాన్స్‌కు తారక్ విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 27 మే 2020 (17:31 IST)
ఆంధ్రుల ఆరాధ్యదైవం, మహానటుడు, దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మే 28వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగనున్నాయి. అయితే, ఈ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ యేడాది ఈ కార్యక్రమాన్ని కేవలం డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తోంది. 
 
అలాగే, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన సమాధి అయిన ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా వెళ్లి నివాళులు అర్పిస్తుంటారు. కానీ, ఈ యేడాది అక్కడకు వెళ్లరాదని నిర్ణయించారు. 
 
అయితే గురువారం ఎన్టీఆర్ ఘాట్‌ను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ సందర్శించడం లేదు. ఇంటి వద్ద నుంచే తమ తాతగారికి వారు నివాళి అర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
తాము ఘాట్ వద్దకు వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారు రేపు ఘాట్ కు రాకూడదని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఏ ఒక్క అభిమాని కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు రావొద్దని తారక్, కళ్యాణ్ రామ్‌లు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments