Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహ‌ర్షి'లో మ‌హేష్ త‌ల్లి పాత్ర‌లో జయప్రద...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (14:35 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇది మ‌హేష్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే.... ఈ సినిమాలో మ‌హేష్ త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద న‌టిస్తున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
జ‌య‌ప్ర‌ద త‌న పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటేనే న‌టిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ పాత్ర‌తో పాటు త‌ల్లి పాత్ర కూడా కీల‌క‌మ‌ట‌. అందుకని జ‌య‌ప్ర‌ద‌ని సంప్ర‌దించ‌గా... పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చేసార‌ట‌. కృష్ణ - జ‌య‌ప్ర‌ద క‌లిసి చాలా స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌లో న‌టించారు. ఇప్పుడు మ‌హేష్ బాబుకి జ‌య‌ప్ర‌ద త‌ల్లిగా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ భారీ సినిమాని ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా న‌టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments