Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన జాన్వీ కపూర్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:07 IST)
బాలీవుడ్‌ కథా నాయిక జాన్వీ కపూర్‌ తాజాగా రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసారు. విలాసవంతమైన రెసిడెన్షియల్‌‌లో క్వాలిటీగా పేరొందిన జుహూ విలే పార్లే స్కీం పక్కనే జాన్వీ కపూర్‌ కొనుగోలు చేసిన ఆస్తి ఉంది. ఇది బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం నివాసం పక్కనే.
 
అమితాబ్‌ బచ్చన్‌తోపాటు అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గన్‌, ఏక్తా కపూర్‌ తదితర సెలబ్రిటీల సొంత భవనాల పక్కనే జాన్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ తన కుటుంబంతో కలిసి లోఖండ్‌వాలాలో నివాసం ఉంటున్నారు.
 
2020 డిసెంబర్‌ 10వ తేదీన జాన్వీ కపూర్‌ ఈ ఆస్తిని రిజిస్టర్‌ చేయించుకున్నట్లు సమాచారం. సదరు బిల్డింగ్‌లోని 14,15, 16 అంతస్తుల్లో 4,144 చదరపు అడుగుల ప్లాట్లు ఆమె కొనుగోలు చేశారు. 
 
కాగా, 2018లో ఇషాన్‌ ఖట్టర్‌తో కలిసి 'ధడక్‌' చిత్రంతో జాన్వీ కపూర్‌ సినీ రంగంలోకి ప్రవేశించారు. మరాఠీలో సైరాత్‌ పేరుతో నిర్మించిన సినిమాకు 'ధడక్‌' రీమేక్‌. సైరాత్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments