Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుకు జబర్దస్త్ నటుడు హెచ్చరిక.. చింతామణిపై నిషేధం ఎత్తివేయాలి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 'జబర్దస్త్' నటుడు అప్పారావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణం ఈ నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పైగా, ఈ చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. గత 1920లో చింతామణి నాటకాన్ని కాళ్లకూరి నారాయణ రావు రాశారని చెప్పారు. ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలేగానీ, ఇలా నిషేధం విధించడం సబబు కాదన్నారు. 
 
అంతేకాకుండా, చింతామణి నాటకంపై నిషేధం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ విశాఖపట్టణంలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన దిగారు. ఇందులో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. 1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణ రావు ఆ నాటకాన్ని రాశారని గుర్తు చేశారు. అలాంటి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. కళాకారులను, కళలను ప్రోత్సహించాలని, చింతామణి నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments