Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుకు జబర్దస్త్ నటుడు హెచ్చరిక.. చింతామణిపై నిషేధం ఎత్తివేయాలి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 'జబర్దస్త్' నటుడు అప్పారావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణం ఈ నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పైగా, ఈ చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. గత 1920లో చింతామణి నాటకాన్ని కాళ్లకూరి నారాయణ రావు రాశారని చెప్పారు. ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలేగానీ, ఇలా నిషేధం విధించడం సబబు కాదన్నారు. 
 
అంతేకాకుండా, చింతామణి నాటకంపై నిషేధం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ విశాఖపట్టణంలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన దిగారు. ఇందులో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. 1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణ రావు ఆ నాటకాన్ని రాశారని గుర్తు చేశారు. అలాంటి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. కళాకారులను, కళలను ప్రోత్సహించాలని, చింతామణి నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments