Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ వీరాభిమానిని కానీ ఇమేజ్‌కు తగిన విధంగా సినిమా తీయలేను : వర్మ

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:04 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తాను వీరాభిమానని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే, పవన్ హీరోయిజంకు తగిన విధంగా తాను సినిమాలు తీయలేనని చెప్పారు. ఎందుకంటే.. పవన్ సినిమాలను తాను ఎక్కువగా చూడలేదని... తాజా చిత్రం 'వకీల్ సాబ్'ను కూడా చూడలేదని చెప్పారు. 
 
'దెయ్యం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'దెయ్యం' సినిమాలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
 
వకీల్ సాబ్ సినిమా చూడలేదనీ, కానీ ట్రైలర్ చూశానని, చాలా బాగుందని చెప్పారు. సినిమాకు వచ్చిన రివ్యూల గురించి కూడా విన్నానని తెలిపారు. పవన్ హీరోగా సినిమా చేయడం తనకు చేత కాదని పేర్కొన్నారు. 
 
వకీల్ సాబ్ సక్సెస్‌పై వర్మ మాట్లాడుతూ, పవన్‌ను ఉన్న ఇమేజ్, హీరోయిజం, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు ఆయన అభిమానులు అంచనాలను అందుకునే విధంగా తాను సినిమా చేయలేనని చెప్పారు. 
 
హీరోయిజం చూపించే కమర్షియల్ చిత్రాల కంటే జోనర్ చిత్రాలను తాను ఎక్కువగా తెరకెక్కిస్తానని... పవన్‌తో సినిమా చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. తాను తీసే సినిమాలలో స్టార్ హీరోలను తీసుకుంటే అది వాళ్లకే కాకుండా సినిమాకు కూడా మంచిది కాదని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments