Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే - వ‌ర్మ‌..!

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (15:44 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాని ఈ నెల 29న రిలీజ్ చేసారు. అయితే... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హైకోర్ట్ స్టే ఇవ్వ‌డం వ‌ల‌న రిలీజ్ కాలేదు. వ‌ర్మ మాత్రం సుప్రీం కోర్టుకి వెళ్లైనా స‌రే ఈ చిత్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేస్తానంటున్నారు.

హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో వ‌ర్మ మాట్లాడుతూ... సుప్రీంకోర్ట్... ప‌ద్మావ‌త్, ఉడ‌తా పంజాబ్ సినిమాలు వివాద‌స్ప‌దం అయిన‌ప్పుడు చాలా క్లియ‌ర్‌గా చెప్పింది ఏంటంటే... ఒక సినిమాకి సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోను ఆ సినిమాను ఆప‌డానికి వీళ్లేదు అని రెగ్యులేష‌న్స్ జారీ చేసింది. 
 
అందుక‌నే తెలంగాణ హైకోర్టుకి ఈ సినిమాని ఆపాల‌ని కొంతమంది ఫిర్యాదు చేసిన‌ప్పుడు వెంట‌నే కొట్టేయ‌డం జ‌రిగింది. అయితే.. ఏపీలో ఈ సినిమా విడుద‌ల‌ను ఆపేస్తార‌ని ఊహించ‌లేదు. ఇలా జ‌రిగిన దానికి అస‌లు దీని వెన‌క ఎవ‌రు ఉన్నారో అంద‌రికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పేర్లు చెప్పే ధైర్యం లేక కాదు. ప్ర‌స్తుతం ఇది కోర్టు ప‌రిధిలో ఉంది కాబ‌ట్టి చెప్ప‌డం లేదు. 
 
కానీ... నేను చెప్పినా చెప్ప‌క‌పోయినా ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు అన్నారు. ఈ సినిమాకి రిలీజైన అన్నిచోట్లా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు మీరే అనుకుంటున్నా అని హీరో హర్షవర్ధన్‌ చేసిన ట్వీట్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా వర్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోదావరి నదిలో మునిగిన పడవ.. ఇద్దరి మృతి.. 10 మంది సురక్షితం

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments