Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్లో రీమేక్ కానున్న టాలీవుడ్ హిట్ మూవీస్..!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (22:21 IST)
టాలీవుడ్ మూవీస్‌కి బాలీవుడ్లో ఈమధ్య క్రేజ్ పెరగడం తెలిసిందే. బాహుబలి సినిమా చరిత్ర సృష్టించడంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ టాలీవుడ్ వైపు చూడడం మరింత పెరిగిందని చెప్పచ్చు. ఇటీవల టాలీవుడ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 
 
కబీర్ సింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. దీంతో బాలీవుడ్లో మరిన్ని తెలుగు సినిమాలు రీమేక్ కానున్నాయని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎనర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇస్మార్ట్ శంకర్. 
 
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమా హిట్. ఈ సినిమా కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందని తెలిసింది. ఈ మూవీని కబీర్ సింగ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నారని టాక్. మరి.. టాలీవుడ్లో సక్సస్ సాధించిన ఇస్మార్ట్ శంకర్, హిట్ మూవీస్ బాలీవుడ్లో కూడా సక్సస్ సాధిస్తాయో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments