Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూర్ణోదయ సంస్థ నిర్మించిన 10 కళా ఖండాలు..!

పూర్ణోదయ సంస్థ నిర్మించిన 10 కళా ఖండాలు..!
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:03 IST)
చిరంజీవి
సీనియర్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తీసిన 10 సినిమాలు కళా ఖండాలే. ప్ర‌పంచ సినీయ‌వ‌నిక ‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపు తప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే సినిమాలను కాపాడిన ఆపద్భాందవుడు. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. ఆయన 86వ జయంతి సందర్భంగా ఆయన గురించి.. ఆయన నిర్మించిన సినిమాల గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం..!
 
24, ఏప్రిల్ 1934 గోదావరి జిల్లా తణుకు లో ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. ఏడిద నాగేశ్వరరావు మూడు పదుల సినీ జీవితం. నిర్మాణ సారధిగా తన మిత్రులతో కలిసి సిరిసిరిమువ్వతో మొదలయి, 1979లో పూర్ణోద‌య సంస్థ‌ను స్థాపించి పదే పది సినిమాలను నిర్మించారు. ఈ పది చిత్రాలు కూడా కళాత్మక చిత్రాలుగా, తెలుగువాడి ఆత్మ‌గౌర‌వానికి సింబాలిక్‌గా ఓ అరుదైన సంత‌కంలాగా నిలిచిపోయాయి. ‌మొదటి సినిమా తాయారమ్మ బంగారయ్య ఆరోగ్యకరమైన హాస్య భరిత చిత్రంగా అల‌రించింది. 
 
రెండవ సినిమా శంకరాభరణం. ఇది 1980లో రిలీజైంది. ఈ సినిమా, తెలుగు జాతికి, ఏడిదకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అలాగే అరుదైన స్వర్ణ కమలం జాతీయ పుర‌స్కారాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబలి చిత్రానికి మాత్ర‌మే స్వ‌ర్ణ‌క‌మ‌లం ద‌క్కింది. కమర్షియల్ ‌ సినిమా హవా నడుస్తోన సమయంలో ఈ సినిమా అప్పట్లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. 
 
తర్వాత దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. చిరంజీవి ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో స్వయంకృషి సినిమాలో న‌టించారు. చిరంజీవి ఏమిటి! చెప్పులు కుట్టేవాడి పాత్రా? అనలేదు. ఈ కథ చిరంజీవిని ఆకట్టుకోవడమే కాదు.. తెలుగోడు త‌లెత్తుకునేలా గొప్ప‌ విజయం సాధించింది. ఈ సినిమా రష్యన్ ‌భాషలోకి అనువాదమైంది. అంతకుముందు ఆయన చిత్రాలన్నీ రష్యన్ భాషలోకి అనువదించి గొప్ప విజయాన్ని సాధించాయి.
 
ఏడిద వారి మరో చిత్రం ఆపద్భాందవుడు, చిరంజీవి నట జీవితంలో ఓ మైలురాయి, మెగాస్టార్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాల మూలంగా, ఇప్పుడు ఉన్న మహమ్మారి వలన ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు అండగా CCC ప్రారంభించి మరోసారి ఆపత్బాంధవుడు అనే పేరును సార్ధకం చేసుకున్నారు. 
 
ఆ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా  చిరంజీవి రెండవసారి ఎంపికయ్యారు. కమల్‌హాస‌న్‌ నటించిన సాగరసంగమం, స్వాతి ముత్యం చిత్రాలకి ఎన్నో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర బహుమతులు వరించాయి. 
 
అలాగే ఇప్పటివరకూ ఆస్కార్‌కి నామినేషన్‌కి వెళ్లిన ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం. మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరుచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతిన గౌరవించింది? అని ప్ర‌శ్నించుకుంటే.. కనీసం పద్మశ్రీ‌ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు.
 
మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు ఫణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఓ ర‌కంగా ప్రభుత్వాల కంటే ప్ర‌ైవేటు సంస్థ‌లే ఆయ‌న ప్రతిభను బాగా గుర్తించాయి. కళాసాగర్ వారు దశాబ్దపు ఉత్తమ నిర్మాతగా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, సంతోషం లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డులు, ఆ వ్యక్తి మరణాంతరం ఇచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనుషులు జోక్యం చేసుకొని కనీసం ఇప్పటికైనా ఏడిద నాగేశ్వరరావు గారికి ఆ గౌరవం దక్కేలా చూస్తే, మంచి తెలుగు సినిమాలకు వారు ఇచ్చే గౌరవం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు ముందులా ఉండదు... రెమ్యునరేషన్‌లో వెనక్కి తగ్గక తప్పదు : ప్రకాష్