Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాపై ఫిర్యాదు.. హృతిక్ రోషన్‌కు ముంబై క్రైమ్ బ్రాంచ్ సమన్లు

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:50 IST)
ఒకపుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ప్రేమ జంటల్లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ జంట ఒకటి. ఈ తర్వాత వీరి ప్రేమ బ్రేకప్ అయింది. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వస్తున్నారు. అలాగే, ఒకరిపై ఒకరు పరస్పరం నోటీసులు పంపించుకుంటూ వస్తున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో 2016లో కంగ‌న ర‌నౌత్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు హృతిక్ రోష‌న్ ఫిర్యాదు చేశారు. న‌కిలీ మెయిల్ ఖాతా నుంచి త‌న‌కు మెసేజ్‌లు, మెయిల్స్ వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ఈ కేసును రెండు నెల‌ల క్రితం క్రైమ్ బ్రాంచ్‌కు సైబ‌ర్ పోలీసులు బ‌దిలీ చేశారు.
 
దీంతో దీనిపై విచార‌ణ జ‌రుపుతోన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో హృతిక్ రోష‌న్‌కు స‌మ‌న్లు పంపి, విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. కంగ‌నా ర‌నౌత్ ఈ-మెయిల్ కేసులో భాగంగా రేపు విచార‌ణ‌కు వ‌చ్చి, ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించారు. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హృతిక్ వాంగ్మూలం న‌మోదు చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

పాక్ డ్రోన్ దాడితో దెబ్బతిన్న ఇళ్లు: నష్టపరిహారం రూ. 6500, బ్యాంక్ చెక్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటానన్న బాధితుడు

Raja Singh: గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలి: రాజా సింగ్ (video)

Peacok: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments